జెనీవా : ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్పై ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్వో) మరికొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్-19 ప్రతాపం భవిష్యత్పై మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ గేబ్రియసస్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా ప్రభావం మానవవాళిపై చాలా తీవ్రంగా ఉంటుంది. వైరస్ తీవ్రతలో కేవలం కొద్దిశాతం మాత్రమే మనం చూశాము. దీని ప్రభవం మానవ భవిష్యత్పై స్పష్టంగా కనిపిస్తుంది. వైరస్ తీవ్రత చాలామంది ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు. 1918లో వచ్చిన స్ఫానిష్ ఫ్లూ కంటే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే ముందుముందు చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొక తప్పదు. కరోనాను కట్టడి చేయకపోతే వైరస్ ఉగ్రరూపాన్ని చూస్తారు’ అని అన్నారు.
వైరస్ ఉగ్రరూపాన్ని చూస్తారు : డబ్ల్యూహెచ్వో