ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యుఎల్) కోవిడ్ -19 (కరోనా వైరస్) వ్యతిరేక పోరాటంలో తన వంతుగా ముందుకు వచ్చింది. భారతదేశంలో కరోనా వైరస్తో పోరాడటానికి రూ .100 కోట్లను సాయం అందిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అలాగే కరోనా వ్యాప్తిని నిరోధించే శానిటైజర్లు, సబ్బులను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రకటించింది. వ్యక్తిగత, గృహ పరిశుభ్రతకు ఉపయోగించే ఉత్పత్తులను తక్కువ ధరలకే అందించనున్నామని వెల్లడించింది. ప్రజా ప్రయోజనార్ధం ముఖ్యంగా లైఫ్బాయ్ శానిటైజర్, లిక్విడ్ హ్యాండ్ వాష్, డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ధరలను 15 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. తగ్గించిన ఈ ధరల ఉత్పత్తుల ఉత్పత్తిని వెంటనే ప్రారంభిస్తున్నామనీ, ఇవి రాబోయే కొద్ది వారాల్లో మార్కెట్లో లభిస్తాయని మీడియా ప్రకటనలో తెలిపింది.
కరోనా : 2 కోట్ల సబ్బులు ఉచితం, ధరల కోత